SS: గుడిబండలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేపట్టిన తాగునీటి సమస్యల పరిశీలన యాత్ర మూడవ రోజు శుక్రవారం కొనసాగింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన మండలంలోని పలు గ్రామాలు, తండాలు, ఎస్సీ కాలనీలను సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. మంచినీటి ఎద్దడిపై స్థానికులను స్వయంగా అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.