AP: అమరావతిలో బిట్స్ పిలానీ నిర్మాణ ప్లాన్లను మంత్రి లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేష్కు క్యాంపస్ ప్లాన్లను ఆ సంస్థ ప్రతినిధులు చూపించారు. క్యాంపస్లో ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కోర్సులు ఉంటాయని తెలిపారు. రెండు దశల్లో 7వేల మందికి అవకాశం కల్పించేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని వివరించారు.