KMR: రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించనుందనీ మద్నూర్ MRO ముజీబ్ NEFU ఒక ప్రకటనలో తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలోని 8 మండలాలకు 1,250 మందికి రంజాన్ తోఫా ప్రభుత్వం సరఫరా చేస్తుందని అన్నారు. త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆయా మండలాల పరిధిలో పంపిణీ చేయడం జరుగుతుందని తాహసీల్దార్ తెలిపారు.