KNR: ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో రుక్మాపూర్, కాట్నపల్లి గ్రామాల్లో వారం రోజులుగా సాగిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు గురువారంతో ముగిశాయి. ముగింపు వేడుకలో వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య మాట్లాడుతూ.. శిబిరాల ద్వారా విద్యార్థుల్లో సేవా భావం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పేర్కొన్నారు. వాలంటీర్లు చేపట్టిన సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా సమీక్షించారు.