సత్యసాయి: కదిరి రథోత్సవంలో జరిగిన తోపులాటలో ఒక వృద్ధురాలిని కాపాడబోయి కుమార్ అనే యువకుడు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్, రాష్ట్ర ఆక్టివిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి కుమార్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. యువకుడి ధైర్యాన్ని, సేవాభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.