MBNR: పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జంగం విశ్వనాథ్ తన ఉదారతను చాటుకున్నారు. సైకాలజీ విభాగంలో మెరిట్ సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించేందుకు రూ.3 లక్షల చెక్కును వీసీ ప్రొ. కె. శ్రీనివాస్కు అందజేశారు. గత ఏడాది కూడా ఆయన అభ్యర్థుల కోసం రూ.3.5 లక్షల విలువైన పుస్తకాలను విరాళంగా ఇచ్చి అండగా నిలిచారు.