శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడ సంత ప్రాంతంలో 53 మంది త్వరలో పేదలకు కూటమి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గణపతి, రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.