KMR: బాన్సువాడలోని పలు కాలనీల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సంతోష్ కుమార్ తెలిపారు. శ్రీరామ, చైతన్య, శాంతినగర్, సంగమేశ్వర కాలనీలతో పాటు పాత బాన్సువాడ ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు కోత ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా పవర్ కట్ చేస్తామన్నారు.