ELR: నూజివీడు డాక్టర్ ఎంఆర్ అప్పారావు కాలనీలో మున్సిపల్ కమిషనర్ పీరయ్య గురువారం శానిటేషన్పై ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డులోని ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రదేశాలలో డ్రైనేజీల నిర్మాణం లేదని, సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉన్నదని ప్రజలు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ పీరయ్య స్పందిస్తూ.. యాక్షన్ ప్లాన్తో సమస్యలు పరిష్కరిస్తామన్నారు.