ADB: నీటి, రోడ్డు సమస్యలను పరిష్కరించాలని సుంగాపూర్ సర్పంచ్ పెందోర్ లక్ష్మణ్ కోరారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి భవనంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామస్థులకు నీటి సమస్య తలెత్తుతుందని, దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలన్నారు.