MDK: రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ‘స్వయం పరిపాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులు J. భానుప్రకాష్ (DEO), S. నరేష్ (MEO), కుమారస్వామి (కాంప్లెక్స్ HM), T. రాకేష్ (హెడ్ మాస్టర్)గా బాధ్యతలు స్వీకరించి అలరించారు. మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.