KNR: కరీంనగర్ రూరల్ పోలీసులు పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుర్షేడ్కు చెందిన ప్రవీణ్, మహేశ్, శంకర్ నల్లగుంటపల్లిలో రైతు స్వామికి చెందిన గేదెను దొంగిలించారు. బొమ్మకల్ వద్ద వారిని అదుపులోకి తీసుకుని రూ.55 వేల విలువైన గేదెను స్వాధీనం చేసుకున్నారు.