WNP: జిల్లాలోని 25 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. 5,613 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై 213 మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. 1,311 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 1,262 మంది విద్యార్థులు హాజరై 49 మంది గైర్హాజరైనట్టు చెప్పారు.