WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ CPM పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 10 వార్డు CPM పార్టీ కౌన్సిలర్ శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరుసగా గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. పీఎం నరేంద్ర మోదీ స్పందించి గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.