ATP: పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గుత్తి CPM పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు.