KMR: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఒకరికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గురువారం భిక్కనూర్ శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా మద్యం తాగి వాహనాన్ని నడిపిన భాగిర్తిపల్లికి చెందిన స్వామిని నేడు కోర్టులో హజరుపరిచినట్లు వెల్లడించారు. జడ్జి అతనికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు.