NLG: కొండమల్లేపల్లిలో ఫిబ్రవరి 8న జరిగిన రూ. 33 లక్షల విలువైన గోద్రేజ్ కెమికల్ లారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు లారీ డ్రైవర్ ప్రకాష్ రాజేంద్ర సకరేను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు.తన ఆరుగురు స్నేహితులతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ పాల్గొన్నారు.