BHNG: కృష్ణా నీళ్లు సప్లై చేసే మెయిన్ పైపు పగిలి వారం రోజులు అవుతున్నా గ్రామపంచాయతీ సిబ్బంది పాలకవర్గం పట్టించుకోవడం లేదంటూ గ్రామపంచాయతీ ముందు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల ప్రతాప్ ఆదివారం ధర్నా చేశాడు. నారాయణపురం మండలం, లింగవారిగూడెం గ్రామానికి వారం రోజులు అవుతున్నా పట్టించుకోకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలకు తాగునీరు అందడం లేదన్నారు.