NDL: డోన్ మండలం కొత్త బురుజు గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ‘మాభూమి–మాహక్కు’ గ్రామ సభలో పాల్గొని రైతులకు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి, టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.