సత్యసాయి: కదిరిలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజైన శనివారం రాత్రి స్వామి వారు ‘మోహన నరసింహుడై’ పల్లకిపై భక్తులకు దర్శనమిచ్చారు. క్షిరసాగర మథనంలో రాక్షసులను మాయావిలాసంతో మోహింపజేసి, దేవతలకు అమృతాన్ని దక్కించిన మోహినీ అవతార విశిష్టతను ఈ ఉత్సవం చాటిచెప్పింది. ఈ దివ్య ఉత్సవాన్ని కనులారా వీక్షించి భక్తులు తరించారు.