2025 గద్దర్ అవార్డుల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రానికి 4 పురస్కారాలు దక్కడంపై దర్శకుడు సాయిలు కంపాటి హర్షం వ్యక్తం చేశాడు. తన తొలి ప్రయత్నంలోనే ఇలాంటి ప్రతిష్ఠాత్మక గౌరవం లభిస్తుందని ఊహించలేదని, ఈ అవార్డులతో తమ కష్టం ఫలించిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ప్రీమియర్ షోలో ప్రేక్షకుల స్పందన చూసిన క్షణాలను తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన భావోద్వేగంగా చెప్పాడు.