KDP: జమ్మలమడుగులోని లక్ష్మీ నగర్ కాలనీలో ఓ రేకులు షేడ్లో దాచిన 53 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్ సీఐ శివన్న ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో విజిలెన్స్ అధికారుల వరుస దాడులతో అక్రమ రేషన్ బియ్యం రవాణాదారులలో వణుకు మొదలైంది. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గొడౌన్కు తరలించారు.