KDP: తొండూరులోని నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి ఉత్సవమూర్తుల ప్రాకార ఉత్సవం జరగనుంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో తొండూరు విద్యార్థులచే శ్రీ భగవద్గీత శ్లోక పారాయణం నిర్వహించనున్నారు. ఇస్కాన్ వైష్ణవులు శ్రీ గీత సందేశాన్ని అందించనున్నారు.