JGL: ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా రామకృష్ణ శనివారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న గణేశ్ ప్రభుత్వం నిర్వహించనున్న 45 రోజుల శిక్షణకు హైదరాబాద్ వెళ్లడంతో కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. రామకృష్ణను కార్యాలయ సిబ్బంది సన్మానించి, స్వాగతం పలికారు.