W.G: ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్’, అజీవికా మిషన్ పథకాలపై జిల్లా వ్యాప్తంగా ఆరు వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.