భారత్తో T20 WC మ్యాచ్ సమయంలో శ్రీలంక పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని పాక్ స్పిన్నర్ ఉస్మార్ తారిక్ ఆరోపించాడు. మ్యాచ్ వేళ టీమిండియా ప్లేయర్ల బ్యాగులను పోలీసులు కనీసం పట్టుకోలేదు కానీ తమతోపాటు టీమ్ స్టాఫ్ బ్యాగులను ఒకటికి 2 సార్లు చెక్ చేశారని అసహనం వ్యక్తంచేశాడు. తమపై ఇంతటి వివక్ష ఎందుకంటూ సీరియస్ అయ్యాడు. అతని ఆరోపణల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.