TG: సీఎం రేవంత్ సమక్షంలో 126 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. 4 బస్సుల్లో హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు మావోయిస్టులు చేరుకుని 124 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీరంతా దేవ్జీకి చెందిన PLG కమిటీ సభ్యులని అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను కాసేపట్లో సీఎం వెల్లడించనున్నారు.