ఆసిఫాబాద్ పట్టణంలో శనేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్యామ్ నాయక్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయన్నారు.