SRD: మహిళలపై వేధింపులు ఆపాలని కోరుతూ సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయరాజ్, నాయకులు పాల్గొన్నారు.