WGL: గీసుకొండ మండల కేంద్రంలోని కొమ్మాల గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ ఊరేగింపును రాత్రి 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.