E.G: అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఛైర్మన్ ఆవిష్కరించారు. అంబేద్కర్ను రాజ్యాంగ నిర్మాతగానో, దళిత నాయకుడుగానో, ప్రపంచ నేతగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.