KNR: గన్నేరువరం మండలంలోని గుణుకులకొండాపూర్ గ్రామంలో శనివారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో, పాఠశాల హెచ్ఎం, గ్రామపంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.