NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు. చిట్యాల, వెలిమినేడు పీహెచ్సీల వైద్యులు ఈసం వెంకటేశ్వర్లు, సత్య నరేష్, నరసింహ, ఇతర వైద్య నిపుణులు సేవలందించారు.