AKP: సోలార్ విద్యుత్ ఏర్పాటుకు వినియోగదారులు ముందుకు రావాలని విద్యుత్ శాఖ ఏడీఏ సునీల్ విజ్ఞప్తి చేశారు. కోటవురట్ల మండలం బీకే పల్లిలో మండల టీడీపీ అధ్యక్షుడు లింగన్నాయుడు అధ్యక్షతన సోలార్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే బిల్లులు గణనీయంగా తగ్గుతాయన్నారు.