విశాఖలోని నేవల్ ఆసుపత్రి కల్యాణిలో కంటి వైద్య సేవలను మరింత మెరుగుపరచేందుకు ఆప్తాల్మాలజీ విభాగంలో అధునాతన 3-డి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ‘Zeiss ARTEVO 850’ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో కంటి శస్త్రచికిత్సల్లో అధిక ఖచ్చితత్వం, స్పష్టత సాధ్యమవుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.