SRPT: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కలెక్టర్ తన సొంత ఖర్చులతో పరీక్షా కిట్లు అందించనున్నారు. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికి వీటిని పంపిణీ చేయనున్నట్లు డీఈవో అశోక్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. మరో వారం రోజుల్లో ఆయా పాఠశాలలకు పరీక్షా కిట్లు అందజేస్తామన్నారు.