WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,330 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,100 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.35,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.19,200, ఎల్లో మిర్చికి రూ.21వేల ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.