TPT: రాష్ట్ర గవర్నర్ శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు గవర్నర్కు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. గవర్నర్ రాక సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలువురు జిల్లా అధికారులు కూడా అక్కడికి చేరుకుని గవర్నర్కు స్వాగతం పలికారు.