MBNR: చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ చట్టం 2029లో అమలులోకి రాబోతుందని ఎంపీ డీకే అరుణ స్పష్టంచేశారు. ఇవాళ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు జిల్లా ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోడీ మహిళ సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.