NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదర మండలంలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాలయం ఆవరణలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నిర్మాణంపై చర్చించారు. ఎంతో చరిత్ర కలిగిన మద్దిమడుగు దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.