ASF: జిల్లాలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం కేటాయించిన డోంగల్ గడువు ముగిసింది. రెన్యువల్ చేయడంలో జాప్యం జరుగుతుండటంతో, మీసేవ కేంద్రాల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. నాన్-అవైలబిలిటీ సర్టిఫికెట్ల కోసం కూడా నిరీక్షణ తప్పడం లేదు. ఉన్నతాధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు