అన్నమయ్య: కొత్తపల్లి మాండవ్య నది తీరాన ఉన్న మల్లూరమ్మ ఆలయ ఈవో కొండారెడ్డిని దేవదాయ శాఖ సస్పెండ్ చేసింది. ఆలయ హుండీ తాళాలు మాయం కావడం,అమ్మవారి నగదు లెక్కల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ రామచంద్ర మోహన్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు, భక్తుల ఫిర్యాదులపై విచారణ చేపట్టగా, విచారణ పూర్తయ్యే వరకు శివయ్యను ఇన్ఛార్జ్ ఈవోగా నియమించారు.