SKLM: శ్రీకాకుళం జిల్లా హిరమండలం పంచాయతీలోని గురువారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పంచాయతీ ఇంచార్జ్ ఈవో సాయిప్రసాద్ బుధవారం ప్రకటనలో తెలిపారు. రక్షిత నీటి పథకాల మోటార్లు మరమ్మతులకు గురయ్యాయని, పలుచోట్ల పైపులైన్లు పాడవటం తో బాగు చేస్తున్నట్లు చెప్పారు. అంతవరకు ట్యాంకర్ల తో నీరు సరఫరా చేస్తామన్నారు.