కృష్ణా: బంటుమిల్లి మండల డంపింగ్ యార్డ్ను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించి, వ్యర్థాల నిర్వహణ విధానంపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్లో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచడం, చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదన్నారు.