CTR: శ్రీరంగరాజపురంలో నిర్వహిస్తున్న ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజు స్వామి ఆలయ మహాభారత వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన అర్జున తపస్సు భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అర్జున తపస్మాన్ వద్దకు చేరుకున్న అర్జున వేషధారి పద్యాలు ఆలపిస్తూ తపస్మాన్ను అధిరోహించాడు.