ELR: ముదినేపల్లి మండలం పెదకామనపూడికి చెందిన దొండపాటి వరప్రసాద్(22) గురువారం మృతి చెందాడు. చెరువు గట్ల కోసం మట్టి తోలుతుండగా ట్రాక్టర్ దిగబడి ఉన్న దాన్ని మరో ట్రాక్టర్తో బయటకు లాగే క్రమంలో ప్రమాదవశాత్తు వాటి మధ్య ఇరుక్కుపోయి యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.