NDL: బేతంచర్ల మండలం బుగ్గనపల్లె గ్రామానికి చెందిన 80 గొర్రెలు బనగానపల్లె మండలం చెరువుపల్లె సమీపంలో మేతకు వెళ్లి నీటిలో ఒకదానిపై ఒకటి పడి ఇవాళ మృతి చెందాయి. విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను ఓదార్చారు. గొర్రెల మృతితో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు.