KMR: బిక్కనూర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం దేశానికే ఆదర్శమని, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రాములు ఉన్నారు.