AKP: గొలుగొండ మండలం సాలికమల్లవరం పంచాయతీ పొగచెట్లపాలెం రెవెన్యూ గ్రామంలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. తహసీల్దార్ కాకర నూకరాజు ఆదేశాల మేరకు ఈ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని సర్వే డీటీజీ కొండబాబు, వీఆర్వో పడాల్ తెలిపారు. అనంతరం పాసుపుస్తకాల ఉపయోగాలను రైతులకు వివరించారు.