భారతీయ విద్యార్థులకు కెనడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్-కెనడా మధ్య విద్యా సంబంధాలను పునరుద్ధరించే దిశగా కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 921 కోట్లు) భారీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కార్యాలయం ఈ నెల 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది.